12 గంటల్లోనే ఏకంగా 34 కేసులు నమోదు

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 12:48 PM

ఒకపక్క తెలంగాణా రాష్ట్రంతో పాటుగా మరోపక్క ఆంధ్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. ఏపీలో అయితే కేవలం కొన్ని గంటల్లోనే అంతకంతకు పెరిగిపోతూ వస్తుంది. ప్రతీ రోజులానే అధికారికంగా ఎక్కడెక్కడ కరోనా కేసులు నమోదు అవుతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం వారు ఇప్పుడు కూడా తెలిపారు.

నిన్న శనివారం రాత్రి 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు నమోదు కాబడిన కేసుల జాబితాను విడుదల చేశారు. నిన్న ఉదయం నుంచి రాత్రికే 12 కొత్త కేసులు నమోదు కావడం మూలాన 192 కు ఆ సంఖ్యా చేరుకోగా ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ 192 కాస్తా 226 కు పెరిగింది. అంటే గడిచిన 12 గంటల్లోనే ఏకంగా 34 కేసులు నమోదు అయ్యాయి. ఈ సమాచారం ప్రకారం గుంటూరు,చిత్తూరు మరియు కర్నూల్,కృష్ణ జిల్లాల్లో కరోనా తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది.





Untitled Document
Advertisements