దేశ ప్రజల్లోని స్ఫూర్తే భారత స్ఫూర్తి

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 01:19 PM

ఈ రోజు రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు లైట్లు స్విచ్ఛాఫ్‌ చేసి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ స్ఫూర్తిని చాటాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు.

'అభిమానుల్లోని పవరే స్టేడియంలోని పవర్‌. అలాగే, దేశ ప్రజల్లోని స్ఫూర్తే భారత స్ఫూర్తి. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మన దేశ ప్రజలమంతా ఒకటిగా నిలబడతామని ప్రపంచానికి చాటుదాం. అలాగే, వైద్య సిబ్బందికి మద్దతుగా మనం ఉన్నామని చాటి చెబుదాం. టీమిండియా చైతన్యవంతమైంది' అని ఆయన ట్వీట్ చేశాడు.





Untitled Document
Advertisements