ఏపీలో దారుణం: కరోనా లక్షణాలతో ఏటీఎంలోకి వెళ్లిన వ్యక్తి

     Written by : smtv Desk | Sun, Apr 05, 2020, 02:13 PM

ఏపీలో దారుణం: కరోనా లక్షణాలతో ఏటీఎంలోకి వెళ్లిన వ్యక్తి

ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతుంది. దీంతో ఏపీలో ప్రస్తుతం 200కు పైగా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఎక్కడ ఏ కొత్త కేసులు ఎప్పుడు బయట పడతాయిని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు. అయితే ఓ వైపు కరోనా టెన్షన్‌తో చస్తుంటే.. మరొవైపు కొందరు పిచ్చి పిచ్చి పనులకు తెర లేపుతున్నారు. కరోనా లక్షణాలతో ఓ యువకుడు కడప జిల్లాలో హల్ చల్ చేశాడు. దగ్గు,జలుబు, జ్వరంతో బాధపడుతున్న ఓ యువకుడు ఇంట్లో క్వారంటైన్‌లో ఉండకుండా ఏటీఎంకు వెళ్లాడు. ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లి ఏటీఎం డిస్ ప్లే, నంబర్ బోర్డుపై లాలా జలాన్ని ఊశాడు. దీంతో ఇది గమనించిన కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పట్టణంలోని రాయల్ సర్కిల్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ కు వచ్చాడు. లోపలికి వెళ్లి, ఏటీఎం డిస్ ప్లే, నంబర్ బోర్డు తదితరాలపై లాలా జలాన్ని ఊశాడు. దీన్ని గమనించిన కొందరు, వెంటనే ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్ కు తీసుకుని వెళ్లి, వైద్యులతో పరీక్షలు జరిపించారు. అతను జలుబు, దగ్గు ఉన్నాయని, 101 డిగ్రీల జ్వరం కూడా ఉందని వైద్యులు నిర్ధారించారు. దీంతో వెంటనే ఏటీఎంను మూసివేశారు పోలీసులు. బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కేసు నమోదు చేశామని, వైద్య చికిత్స తరువాత విచారణ కొనసాగుతుందని పోలీస్ అధికారులు తెలిపారు.

కరోనా భయాందోళన ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ, ఉంటే ఇండ్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏవైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కానీ యువకుడు ఊహించని చేసిన ఈ వెధవ పనికి అందరూ షాక్ అవుతున్నారు. పట్టణంలో ఊళ్లో తిరగాలంటున్న భయపడుతున్నారు. ఇవాళ తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. అనధికారిక సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు





Untitled Document
Advertisements