కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం ఉద్యోగాలపై తీవ్రప్రభావం చూపనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అంచనా వేసింది. గతవారం దాదాపు రెండు వందల మంది సీఈఓలను సర్వేచేసిన ఈ సంస్థ లాక్డౌన్ అనంతరం భారీగా ఉద్యోగాల కోత ఉంటుందని చెబుతోంది.
‘ఆయా కంపెనీల ఆదాయంలో పది శాతం వరకు క్షీణత ఉంటుంది. లాభాల్లో ఐదు శాతం వరకు క్షీణత తప్పదు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల కోతకే ఆయా సంస్థలు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది కచ్చితంగా 15 శాతం వరకు ఉంటుంది. అనివార్య పరిస్థితుల్లో 30 శాతం వరకు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు’ అంటూ ఆయా సీఈఓ మాటలను ఉటంకిస్తూ ఈ సంస్థ నిర్థారించింది.
ఈ సందర్భంగా సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ ‘ఆకస్మికంగా విధించిన లాక్డౌన్ కారణంగా పరిశ్రమల కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉంది’ అన్నారు.