LIC ఆధార్ పాలసీ .. రోజుకు రూ.28తో రూ.4 లక్షలు!

     Written by : smtv Desk | Mon, Apr 06, 2020, 11:54 AM

LIC ఆధార్ పాలసీ .. రోజుకు రూ.28తో రూ.4 లక్షలు!

దేశీ దిగ్గజ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) ఆఫ్ ఇండియా ఎన్నో రకాల పాలసీలను అందిస్తోంది. మనీ బ్యాంక్, చిల్ట్రన్స్ పాలసీ, టర్మ్ పాలసీ, ఎండోమెంట్ ప్లాన్స్, రిటైర్మెంట్ పాలసీలు ఇలా చాలా రకాల ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తోంది. ఆధార్ స్తంభ్ పాలసీ కూడా ఇందులో ఒకటి.

ఎల్‌ఐసీ ఆధార్ స్తంభ్ పాలసీ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. ఇది లో ప్రీమియం ప్లాన్. రోజుకు రూ.28 ఆదా చేసుకొని ఈ పాలసీతో ఇన్వెస్ట్ చేస్తే మీరు దాదాపు రూ.4 లక్షలు పొందొచ్చు. ఐదేళ్ల తర్వాత లాయల్టీ అడిషన్స్ కూడా లభిస్తాయి. 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ ఎల్‌ఐసీ పాలసీని కనీసం రూ.75,000 బీమా మొత్తానికి తీసుకోవాలి. గరిష్టంగా రూ.3,00,000 మొత్తం వరకు తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల డెత్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి తొలి ఐదేళ్లలోనే మరణిస్తే.. అప్పుడు పాలసీ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. అదే పాలసీదారుడు ఐదేళ్ల తర్వాత మరిణిస్తే.. అప్పుడు నామినీకి బీమా మొత్తంతోపాటు లాయల్టీ అడిషన్స్ కూడా అందిస్తారు. ఉదాహరణకు 8 ఏళ్ల వయసు ఉన్న వారికి ఈ పాలసీ తీసుకుందామని భావిస్తే.. పాలసీ టర్మ్ 20 ఏళ్లు. రూ.3 లక్షల మొత్తానికి పాలసీ తీసుకున్నాం. ఇప్పుడు తొలి ఏడాది ప్రీమియం రూ.10,541 అవుతుంది. ఆరు నెలలకు రూ.5327, మూడు నెలలకు రూ.2692, నెలకు రూ.898 అవుతుంది. అంటే రోజుకు రూ.28 ఆదా చేస్తే సరిపోతుంది.

ఇలా మీరు పాలసీ గడువులో ప్రీమియం రూపంలో దాదాపు రూ.2 లక్షలు చెల్లిస్తారు. మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.3 లక్షల బీమా మొత్తం అందిస్తారు. లాయల్టీ అడిషన్ రూ.97,500. అంటే మీకు మొత్తంగా చేతికి దాదాపు రూ.4 లక్షలు వస్తాయి. 8 ఏళ్ల చిన్న పిల్లల పేరుపై ఈ పాలసీ తీసుకుంటే ఉత్తమం.





Untitled Document
Advertisements