చెన్నై, నవంబర్ 20 : అట్టహాసంగా ప్రారంభమైన ఐఎస్ఎల్-4 తొలి రెండు మ్యాచ్లు ఒక్క గోల్ కాకుండా డ్రాగా ముగియగా, ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ లో ఏకంగా ఐదు గోల్స్ నమోదయ్యాయి. ఈ మ్యాచ్ లో ఎఫ్సీ గోవా 3-2 తో చెన్నైను మట్టికరిపించింది. 25 వ నిమిషంలో గోవా ఆటగాడు ఫెరాన్ బంతిని నెట్లోకి పంపి ఈ సీజన్కు తొలి గోల్ నమోదు చేశాడు. మరో మ్యాచ్ లో బెంగళూరు, 2-0 గోల్స్తో ముంబైని ఓడించింది. తొలి సెషన్ లో ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి. బెంగళూరు తరపున సునీల్ ఛెత్రి కీలక సమయంలో గోల్ చేయడంతో ముంబై ఆశలు ఆవిరయ్యాయి.