ఈడెన్ లో కోహ్లీ తొలి అర్ద శతకం...

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 01:39 PM

ఈడెన్ లో కోహ్లీ తొలి అర్ద శతకం...

కోల్‌కతా, నవంబర్ 20 : భారత్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లి, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. లంచ్ విరామం తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు కెప్టెన్ 80 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో విరాట్ అర్థ శతకం నమోదు చేశాడు. ఇది కోహ్లి టెస్టు కెరీర్ లో 15వ హాఫ్ సెంచరీ. కాగా, ఈడెన్ గార్డెన్ లో కోహ్లికి తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకూ తన టెస్టు కెరీర్ లో 17 సెంచరీలను కోహ్లి సాధించాడు. భారత్ జట్టు ప్రస్తుతం 322/8 తో, 200 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో విరాట్ కోహ్లి(86), షమీ(1) ఉన్నారు. ఇప్పటి వరకు మ్యాచ్ పరస్థితి గమనిస్తే డ్రాగా ముగిసే ఆవకాశం కన్పిస్తుంది.





Untitled Document
Advertisements