అమరావతిలో అవార్డులు అందుకున్న నటులు...

     Written by : smtv Desk | Mon, Nov 20, 2017, 02:56 PM

అమరావతిలో అవార్డులు అందుకున్న నటులు...

అమరావతి, నవంబర్ 20: సోషల్ మీడియాలో చురుగ్గా పాల్గొనే సినీ నటులకు అమరావతి ప్రభుత్వం అవార్డులను అందజేశారు. విజయవాడలో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'సోషల్‌ మీడియా సమ్మిట్‌ 2017 అవార్డు' ప్రదానోత్సవంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చేతుల మీదుగా బాలీవుడ్ నటి దీపికా పదుకునే అవార్డు అందుకుంది. అంతేకాదు నటుడు దగ్గుబాటి రానా, కొలవెరి డి పాటతో సంచలనం సృష్టించిన సంగీత దర్శకుడు అనిరుధ్‌, తెలుగులో ప్రముఖ హాస్యనటుడిగా గుర్తింపు పొందిన వైవా హర్ష ఈ అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు యూట్యూబ్‌లో వంటలు, హాస్యం, సాంకేతికత, గేమింగ్‌, పిల్లల ఛానెళ్లను నిర్వహించే వారికీ కూడా అవార్డులను అందజేశారు.

ఈ సందర్బంగా దీపికా మాట్లాడుతూ..." నాకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి అభిమానులే కారణం. ఇక్కడా ఇంతమంది అభిమానులు ఉండడం ఆనందంగా ఉంది. 'థాంక్యూ అమరావతి'. సోషల్‌ మీడియాలో ఏం చేసినా ఆలోచిస్తాను. ఈ మాధ్యమాన్ని ఎలా వినియోగించుకోవాలో బాగా తెలుసు. నా అభిమానులతో సోషల్‌ మీడియాలో పారదర్శకంగా ఉంటాను. ఎలాంటి దాపరికాలూ ఉండవు. నా సినిమాలు, పని, ఎక్కడికైనా వెళ్లినా అలాంటి సమాచారం మాత్రం ఎప్పటికప్పుడు చెబుతాను. ఈ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. మళ్లీ త్వరలోనే అమరావతికి వస్తానని " అన్నారు.





Untitled Document
Advertisements