చెన్నై, నవంబర్ 20 : ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరిట శశికళ బంధువులను, సన్నిహితులను లక్ష్యంగా చేసుకుని తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ శశికళపై ట్విటర్లో స్పందిస్తూ.. పరోక్షంగా విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం దోపిడీలకు పాల్పడితే అది నేరం. కానీ నేరం బయటపడిన తర్వాత కూడా ఒప్పుకోకపోవడం నేరం కాదా? గంట మోగింది. ఇక క్రిమినల్ రాజ్యం సాగదు. ప్రజలు న్యాయమూర్తులుగా మారాలి. మేల్కొండంటూ కమల్ తన ట్వీట్లో శశికళపై విమర్శల వర్షం కురిపించారు.