రాజమండ్రి, నవంబర్ 20 : కోరుకొండలో విషాదమైన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో పిల్లలు శర్వాణి, జయదేవ్ మృతి చెందారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘటనకు పాల్పడ్డారని స్ధానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.