హిమాచల్ ప్రదేశ్లో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు!

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 07:03 PM

హిమాచల్ ప్రదేశ్లో జూన్ 30 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు!

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర విధించిన లాక్‌డౌన్ మే 31తో ముగుస్తున్న వేళ తమ రాష్ట్రంలో మరో 5 వారాల పాటు లాక్‌డౌన్ కొనసాగించనున్నట్లు సోమవారం (మే 25) ప్రకటించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుందని ఈ హిమాలయ రాష్ట్రం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటివరకు 214 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 63 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 145 యాక్టివ్ కేసులు ఉన్నాయి.





Untitled Document
Advertisements