కేంద్ర ప్రభుత్వం స్కీమ్... రూ.లక్ష పెడితే.. రూ.2 లక్షలు!

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 07:11 PM

కేంద్ర ప్రభుత్వం స్కీమ్... రూ.లక్ష పెడితే.. రూ.2 లక్షలు!

బ్యాంకులు వరుసపెట్టి వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. దీంతో ఇలాంటి సమయంలో బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం వల్ల వచ్చే రాబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. మరి అధిక రాబడి కోసం ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి? మీ కోసం కేంద్ర ప్రభుత్వం భారత్ బాండ్ ఈటీఎఫ్ ప్రోగ్రామ్‌ను మరోసారి అందుబాటులోకి తీసుకురాబోతోంది.

ఎడిల్‌వీస్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ భారత్ బాండ్ ఈటీఎఫ్ రెండో విడతకు రెడీ అవుతోంది. జూలైలో ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది. ఇందులో రెండు రకాల మెచ్యూరిటీ ఆప్షన్లు ఉంటాయి. 2025 ఏప్రిల్, 2031 ఏప్రిల్ అనేవి ఇవి. భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో డబ్బులు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే కచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఒకవేళ డీమ్యాట్ ఖాతా లేకుంటే భారత్ బాండ్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తన ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ద్వారా భారత్ బాండ్ ఈటీఎఫ్ స్కీమ్‌ను అందిస్తోంది. ఎడిల‌వీస్ ఏఎంసీ ఈ ఈటీఎఫ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. ఈ సంస్థ రెండో విడత భారత్ బాండ్ ఈటీఎఫ్ ద్వారా రూ.14,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది.

మీరు భారత్ బాండ్ ఈటీఎఫ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశారని భావిస్తే.. మీ డబ్బుకు 7.58 శాతం రాబడి వస్తుంది. ఈ రాబడి ప్రాతిపదికన పదేళ్లలో మీ డబ్బు రూ.2.07 లక్షలు అవుతుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై ట్యాక్స్ కూడా పడుతుంది. ఇది రూ.7,836గా ఉంటుంది. అప్పుడు మీ చేతికి దాదాపు రూ.2 లక్షలు వస్తాయి. అంటే మీరు వచ్చే నెలలో రూ.లక్ష పెడితే మెచ్యూరిటీలో రూ.2 లక్షలు తీసుకోవచ్చు. రూ.లక్ష లాభం.





Untitled Document
Advertisements