డ్రగ్స్ కేసులో శ్రీలంక బౌలర్ అరెస్ట్!

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 08:03 PM

డ్రగ్స్ కేసులో శ్రీలంక బౌలర్ అరెస్ట్!

డ్రగ్స్‌ కేసులో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ షెహన్ మధుశంకా అరెస్టయ్యాడు. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన మధుశంకా.. తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ వికెట్లతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో వరుసగా మొర్తజా, రుబెల్ హుస్సేన్, మహ్మదుల్లా వికెట్లను అతను పడగొట్టాడు. అయితే.. గాయం కారణంగా 2018 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కి ఈ పేసర్ దూరమయ్యాడు. కరోనా వైరస్ కారణంగా మార్చి నుంచి శ్రీలంకలో లాక్‌డౌన్ అమల్లో ఉండగా.. ఇటీవల నిబంధనల్ని కొన్ని సడలించారు. కానీ.. స్నేహితుడితో కలిసి కారులో పన్నాల రోడ్డుపై వెళ్తున్న షెహన్ మధుశంకా‌ని ఆపిన పోలీసులు.. తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో షెహన్ మధుశంకా వద్ద 2 గ్రాముల హెరాయిన్ లభించడంతో అతనిపై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. రెండు వారాల కస్టడీకి మెజిస్ట్రేట్ ఆదేశించారు. మార్చి 20 నుంచి ఇప్పటి వరకూ శ్రీలంకలో దాదాపు 65 వేల మంది లాక్‌డౌన్ నిబంధనల్ని అతిక్రమించి అరెస్టయ్యారు. ఇందులో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉండగా.. క్రికెటర్‌ కూడా ఆ జాబితాలో చేరడం విశేషం. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా షెహన్ మధుశంకాపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.






Untitled Document
Advertisements