"రాత్రి కొందరు కుర్రాళ్ళు.. కామం కళ్ళతో అలా చేశారు"

     Written by : smtv Desk | Mon, May 25, 2020, 09:01 PM


నేటి సమాజంలో కొందరు కీచక యువకులు నడి రోడ్డుపైనే నానా హంగామా చేస్తూ అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నారని, తన విషయంలోనూ అదే జరిగిందని అంటోంది జబర్దస్త్ నటి ప్రియాంక (సాయి తేజ). జబర్దస్త్ తెరపై ఆడ వేషాలు వేస్తూ బాగా ఫేమస్ అయిన సాయి తేజ.. చివరకు ఆడవారిగా మారేందుకు గాను సర్జరీ చేయించుకొని పూర్తి ఆడదానిగా అయిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. అయితే ఈ మధ్యకాలంలో ప్రియాంకకు పెళ్లైందనే రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియాతో మాట్లాడిన ఆమె తన పెళ్లి వార్తలపై స్పందిస్తూనే.. రియల్ లైఫ్ లో జరిగిన సంఘటన చెప్పి తీవ్ర ఆవేదన చెందింది. మూడు రోజుల కింద తనతో కొందరు కుర్రాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని.. నడి రోడ్డుపై బైక్ ఆపేసి చాలా చెత్తగా బిహేవ్ చేసి రచ్చ రచ్చ చేశారని చెప్పింది ప్రియాంక. అర్ధరాత్రి వేళ తన స్కూటీపై వస్తుంటే వాళ్లు తనను చూసి చెత్త కామెంట్స్ చేశారని, చుడిదార్ వేసుకుని.. పూర్తిగా మొహం కప్పుకుని కేవలం కళ్లు మాత్రమే కనిపిస్తున్నా కూడా తనను వాళ్లు కామం కళ్ళతో చూస్తూ కామెంట్స్ చేయడం బాధగా అనిపించిందని.. అలాంటి పోకిరీ వెదవలను చంపేసినా పాపం లేదని అంటూ ఫైర్ అయింది ప్రియాంక. అలా చేస్తుంటే భయమేసిందని, అర్ధరాత్రి ఓ అమ్మాయితో అలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. ఇలాంటి నీచులు ఉన్నంత వరకు అమ్మాయిలపై దారుణాలు జరుగుతూనే ఉంటాయంటూ ఆవేదన చెందింది. గతంలో కూడా తనను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని చెప్పి సంచలనం సృష్టించిన ప్రియాంక ఈ సారి పోకిరీ వెధవలపై ఫైర్ అయి వార్తల్లో నిలిచింది. అలాగే తన పెళ్లి విషయంపై కూడా కొందరు కావాలనే రచ్చ చేస్తున్నారని అంటోంది ప్రియాంక. తనను అర్థం చేసుకుని పెళ్లి చేసుకునేవాడు దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, అయినా అలాంటి వారు ఎక్కడున్నారని అంటూ తనకు పెళ్లి అయిపోయిందని వస్తున్న వార్తలను ఖండించింది ప్రియాంక.







Untitled Document
Advertisements