పిల్లల పేరుపై ఇన్వెస్ట్మెంట్...ఈ 3 స్కీమ్స్‌లతో అదిరిపోయే రాబడి!

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 11:13 AM

పిల్లల పేరుపై ఇన్వెస్ట్మెంట్...ఈ 3 స్కీమ్స్‌లతో అదిరిపోయే రాబడి!

మీకు పిల్లలు ఉన్నారా? వారి పేరుపై డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. పిల్లల పేరుపై డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డబ్బులు పిల్లలు పెరిగి పెద్దైన తర్వాత వారి చదువు, పెళ్లి వంటి వాటికి ఉపయోగపడతాయి. అందువల్ల ఆ మూడు ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు ఏంటివో చూద్దాం..
Sukanya Samriddhi Scheme : ఆడ పిల్లల పేరుపై సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో చేరి ఖాతా తెరవొచ్చు. ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లల పేరుపై డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ గడువు 21 ఏళ్లు. 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత కొంత డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ వస్తోంది. నెలకు రూ.12,500 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంత కష్టమని భావిస్తే.. నెలకు రూ.1,000 ఇన్వెస్ట్ చేసిన సరిపోతుంది. రూ.12,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెలితే మెచ్యూరిటీ సమయంల రూ.71 లక్షలు పొందొచ్చు.
PPF : మంచి రాబడి అందించే దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇది కూడా ఒకటి. మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. SBI, ఐసీఐసీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకుల్లో ఈ పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. స్కీమ్‌పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. పిల్లల పేరుపై కూడా పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయొచ్చు.
Mutual Funds : మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడి పొందొచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెలితే దీర్ఘకాలంలో అదిరిపోయే రాబడి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పిల్లలపై పేరుపై ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కస్టోడియన్‌గా ఉండాలి.





Untitled Document
Advertisements