ధోనీ నాక్కూడా వార్నింగ్ ఇచ్చాడు: రైనా

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 11:18 AM

ధోనీ నాక్కూడా వార్నింగ్ ఇచ్చాడు: రైనా

‘‘మహేంద్రసింగ్ ధోనీ ఫేవరెట్ ప్లేయర్ సురేశ్ రైనా.. అప్పట్లో కెప్టెన్‌ ధోనీ మద్దతు అతనికి ఫుల్‌‌గా ఉండేది. 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ నా స్థానంలో సురేశ్ రైనాని ఆడించేందుకు ధోనీ ప్రయత్నించాడు’’ రెండు వారాల క్రితం ధోనీపై యువరాజ్ సింగ్ చేసిన విమర్శ ఇది. దాంతో.. ధోనీ పేరు ఎత్తగానే అంతెత్తున లేచే యువీ తండ్రి యోగరాజ్ సింగ్.. ఓ నాలుగు రోజుల పాటు ధోనీపై పెద్దఎత్తున నిప్పులు చెరిగాడు. యువీ కెరీర్‌ని ధోనీ నాశనం చేశాడంటూ మండిపడ్డాడు. కానీ.. ధోనీ మాత్రం స్పందించలేదు. అయితే.. సురేశ్ రైనా తాజాగా యువీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ‘‘అవును నిజమే.. ధోనీ నాకు మద్దతుగా నిలిచాడు. దానికి కారణం.. నాలో టాలెంట్ ఉందని అతను విశ్వసించడమే. ధోనీ నాకు సపోర్ట్ చేసిన ప్రతిసారి నేను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాను. ఒకవేళ నేను ఓ రెండు మ్యాచ్‌ల్లో ఫెయిలైతే..? ధోనీ నుంచి నాకు వార్నింగ్ వచ్చేది. ‘నువ్వు స్కోర్లు చేయలేదో..? కెప్టెన్‌గా నేను కఠిన నిర్ణయం తీసుకుంటాను’ అని ధోనీ చెప్పేవాడు. ఆ టైమ్.. ధోనీ ప్లీజ్ ఓ రెండు అవకాశాలివ్వవా..? మళ్లీ ఆ తప్పులు చేయను అని కోరేవాడ్ని’’ అని సురేశ్ రైనా వెల్లడించాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్న రోజులూ టీమిండియాలో సురేశ్ రైనా, రవీంద్ర జడేజాకి చోటు విషయంలో ఢోకా ఉండేది కాదు. కానీ.. 2017లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకోగా.. ఆ తర్వాత ఏడాదే జట్టులో స్థానం కోల్పోయిన రైనా.. గత రెండేళ్లుగా పునరాగమనం కోసం నిరీక్షిస్తున్నాడు. జడేజా మాత్రం రెగ్యులర్‌ ఆటగాడిగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.







Untitled Document
Advertisements