ఆలయం సమీపంలో భారీ సినిమా సెట్ ధ్వంసం..సీఎం సీరియస్!

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 01:32 PM

ఆలయం సమీపంలో భారీ సినిమా సెట్ ధ్వంసం..సీఎం సీరియస్!

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా సినిమా షూటింగులు, కొత్త సినిమాల విడుదల నిలిచిపోయిన విషయం తెలిసిందే.అయితే విడతల వారీగా లాక్ డౌన్‌ను పెంచుకుంటూ వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. రకరకాల రంగాలవారికి మినహాయింపులు ఇస్తూ వస్తున్నారు. తాజాగా పలు రాష్ట్రాల్లో సినీమా రంగానికి సైతం షూటింగులకు అనుమతి కల్పించారు. దీంతో సినిమావాళ్లు షూటింగులకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ నిమిత్తం ఓ సెట్ వేశారు. అయితే దీనిని ఆందోళన కారులు ధ్వంసం చేశారు. సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్‌ను ధ్వంసం చేయడమే కాకుండా దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా ఆందోళనకారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టులు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై స్పందించిన కేరళ సీఎం పినరయి విజయన్ సీరియస్ అయ్యారు. తీవ్రంగా శ్రమించి ఏర్పాటు చేసుకున్న సెట్‌ను ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే... కేరళలోని ఎర్నాకుళం జిల్లా అలువ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఆలయం వద్ద వేసిన సెట్టింగును ఆదివారం రాత్రి అంతర్రాష్ట హిందూ పరిషత్ కార్యకర్తలు కూల్చేశారని పోలీసులు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు జరిపించి దుండగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది తమ రాష్ట్రంలో జరిగాల్సిన సంఘటన కాదని సీఎం అన్నారు. అయితే 'మిన్నల్ మురళి' అనే చిత్రం షూటింగ్ కోసం ఈ సెట్ వేశామని సినిమా టీమ్ చెబుతోంది. దీనికోసం అధికారుల నుంచి, గ్రామ పంచాయతీ నుంచి అనుమతి కూడా తీసుకున్నామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా కలడీలో వేసిన చర్చి సెట్‌ను అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ (AHP) సభ్యులు కొందరు ధ్వంసం చేశారు. పెరియార్ నది తీరాన జగద్గురు ఆది శంకరాచర్య మఠానికి సమీపంలో కలడీలో నిర్మించిన సెట్ ధ్వసం చేయడంతో పాటు సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయగా వివాదం మరింత రాజుకుంది. మత విద్వేషంతోనే విధ్వంసానికి పాల్పడ్డారని వారు చిత్ర బృందం ఆరోపిస్తోంది. అయితే ఈ దాడిని బీజేపీ, ఆరెస్సెస్ సైతం ఖండించాయి.







Untitled Document
Advertisements