"వాటి కంటే ఐటెం సాంగ్స్ బెటర్"

     Written by : smtv Desk | Tue, May 26, 2020, 04:14 PM


హంసా నందిని ‘ఒకటవుదాం’అనే సినిమాతో 2004లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అయితే 2007లో వచ్చిన అనుమానాస్పదం అనే చిత్రంతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె అసలు పేరు పూనమ్. అనుమానాస్పదం సినిమా తీసేటప్పుడే ఆమె పేరు పూనమ్ నుంచి హంసానందినిగా మారిపోయింది. పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించిన ఆమె.. ఆ తర్వాత మాత్రం ఐటెం సాంగ్స్‌కు పరిమితం అయ్యింది. ఇప్పటివరకు చాలా వరకు ఐటెం సాంగ్‌ల్లో తన అందచందాలతో అలరించింది. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన హంసానందిని ఐటెం సాంగ్‌ల గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్‌గా తనకు వచ్చే రొటీన్ పాత్రలు నచ్చకపోవడం వల్లే సినిమాల్లో స్పెషల్ సాంగ్‌ల వైపు మొగ్గు చూపానని ఈ భామ తెలిపింది. అలాంటి రొటీన్ పాత్రలు చేయడం కంటే స్పెషల్ సాంగ్‌లు చేయడం చాలా బెస్ట్ అని చెబుతోంది ఈ ఐటెం భామ. `ఈగ`, `మిర్చి` వంటి సినిమాల నుంచి స్పెషల్ అప్పీరియెన్స్‌లు ప్రారంభించానని చెప్పింది. స్పెషల్ సాంగ్‌లు రొటీన్‌గా కాకుండా వేటికవే భిన్నంగా ఉంటాయంది హంసానందిని. తనకు కూడా సాంగ్స్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నాన`ని హంసానందిని పేర్కొంది. హంసా నందిని పుట్టి పెరిగింది అంతా పూణెలోనే. మోడలింగ్ చేయడంకోసం ముంబైకి వచ్చింది. 2002 నుంచి మోడలింగ్ రంగంలో ఉంటూ, పలు టెలివిజన్ ప్రకటనలలో నటించింది. ఆమె కామర్స్ లో డిగ్రీ పూర్తిచేసిన హంసా నందిని 2009 లో హ్యూమన్ రిసోర్స్ కోర్స్ లో కూడా చేరింది. 2013 లో మిర్చి, భాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలలో ఐటెం సాంగ్స్‌లో నటించింది. 2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో మెరిసింది.






Untitled Document
Advertisements