సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారం: యశోదా

     Written by : smtv Desk | Sat, Jun 27, 2020, 05:42 PM

సోషల్ మీడియాలో మాపై తప్పుడు ప్రచారం: యశోదా

కరోనా వైరస్ పేషెంట్‌కు చికిత్స అందించడం కోసం యశోదా హాస్పిటల్ ఐదు రోజుల్లో రూ.3.40 లక్షలు ఛార్జ్ చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయమై హాస్పిటల్ వైస్‌ ప్రెసిడెంట్ లలితా రెడ్డి స్పందించారు. ఇదంతా దుష్ప్రచారమేనని ఆమె తెలిపారు. వాహెద్ ఆలీ ఖాన్ అనే పేషెంట్‌ తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య (సారీ)తో బాధపడుతూ తమ హాస్పిటల్‌లో చేరాడని ఆమె చెప్పారు. హైపో ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చిందని.. గంట గంటకు బ్లడ్ లెవల్స్ చెక్ చేయాల్సి ఉంటుందన్నారు..
ఐసీయూలో ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఊపిరితిత్తుల్లో 90 శాతం ఇన్ఫెక్షన్ వచ్చింది. కానీ కేవలం ఐదు రోజుల్లోనే బాగు చేసి డిశ్చార్జ్ చేశామని లలితా రెడ్డి తెలిపారు. ‘‘మా మీద సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. అనవసరంగా తప్పుడు ప్రచారం చేయడం తగదు. మా చికిత్స పట్ల ఫ్యామిలీ మెంబర్స్ సంతృప్తి చెందార’’ని ఆమె చెప్పారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి పాల్పడిన యాకత్‌పురకు చెందిన మీ సేవ నిర్వాహకుడు ముక్తధీర్‌పై కేసు నమోదైందని తెలిపారు. పేషెంట్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.





Untitled Document
Advertisements