సూపర్ స్టార్ ఇంట్లో కరోనా కలకలం...ఒకరికి పాజిటివ్

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 11:02 AM

సూపర్ స్టార్ ఇంట్లో కరోనా కలకలం...ఒకరికి పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో దూకుడుగా ఉండటంతో ప్రజల జీవన విధానం అతలాకుతలమవుతోంది. రోజురోజుకి వైరస్ విజృంభన ఊహించని స్తాయికి చేరుకోవడం అనాదిలోనూ ప్రపంచానికే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు ఏ ఒక్కరినీ కరోనా భూతం వదిలిపెట్టడం లేదు. రజినీకాంత్ ఇంట్లో కరోనా టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే రజినీకాంత్ ఇంటిని కూడా కరోనా తాకినట్లు వార్తలు రావడంతో ఆయన అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత అది నిజం కాదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు కరోనా భయం ఎక్కువ కావడంతో రజినీకాంత్ చెన్నై తన సొంత ఇంటిని వదిలేసి, ఇంటికి దూరంగా ఉన్న ఫామ్ హౌస్‌లో సేద తీరుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇక ఇంట్లో పనిచేసే పని మనిషి ఒకరు కరోనా సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అయ్యాడని తెలిసి.. పని మనుష్యులను కూడా రావొద్దని చెప్పి కేవలం ఇద్దరు పనిమనుషులకే అనుమతి ఇచ్చారట రజినీకాంత్. మిగితా వారికి కూడా నెల నెలా జీతం ఇస్తున్నారట. ఇలా గత రెండు నెలల నుంచే జరుగుతోందని టాక్. ఇకపోతే ప్రస్తుతం తాను ఉంటున్న ఫామ్ హౌస్‌ నుంచి ఎవ్వరైనా సరే బయటకు వెళ్లడం, బయటివాళ్ళు లోపలికి రావడం పూర్తిగా నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారట రజినీకాంత్.

గ్రాసరీకి సంబంధించి కూడా ఏ పనివారినీ బయటకు పంపించకుండా, కేవలం ఫామ్ హౌస్‌లో పండిన కూరగాయాలనే తింటున్నారట. కరోనా పూర్తిగా వెళ్లిపోయే దాకా తిరిగి చెన్నై రావొద్దని, సినిమా షూటింగ్స్‌లో పాల్గొనని డిసైడ్ అయ్యారట రజినీకాంత్.





Untitled Document
Advertisements