తెలంగాణ హోంమంత్రికి కరోనా

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 11:07 AM

తెలంగాణ హోంమంత్రికి కరోనా

తెలంగాణ హోంమంత్రి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. నిన్న రాత్రి ఆయన ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆయకు జలుబు, ఆస్తమా ఉండటంతో మూడు రోజుల క్రితం కరోనా టెస్టులు చేయించుకున్నారు. దీంతో రిపోర్టులో పాజిటివ్ రావడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు. హోంమంత్రికి కరోనా రావడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొందరు సెల్ఫ్ క్వారన్‌టైన్‌లోకి వెళ్లారు. దీంతో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
తెలంగాణలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం 983 కేసులు నమోదయ్యాయి. ఇక రాజకీయ నేతల్లో కూడా కరోనా కలవరం సృష్టిస్తోంది. ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మేల్యు కరోనా బారిన పడ్డారు. అటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్ కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. నేతల దగ్గర పనిచేస్తున్న గన్ మెన్లు సిబ్బంది సైతం వైరస్‌కు గురవుతున్నారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా కూడా పెరుగుతున్న కరోనా కేసులు జనం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. గతత 24 గంటల్లో కొత్తగా 19,459 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల ఒకేరోజు 380 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,48,318కి చేరగా, మృతుల సంఖ్య 16,475కి పెరిగింది.





Untitled Document
Advertisements