అలర్ట్...తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి కొత్త రూల్స్!

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 11:11 AM

అలర్ట్...తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి కొత్త రూల్స్!

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి అలర్ట్. కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.. ఇక నల్గొండ జిల్లా మీదుగా ఏపీకి వెళ్లాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే సరిహద్దు దగ్గర అనుమతిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా నల్గొండ మీదుగా వెళ్లే అన్ని వాహనాలను సాయంత్రం 7.00 తర్వాత ఆంధ్రా సరిహద్దులలో నిలిపివేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ చెప్పారు. దీంతో ప్రయాణికులు అందుకు అనుగుణంగా ప్రయాణించాలని నల్గొండ ఎస్పీ రంగనాథ్ అంటున్నారు.
7.00 గంటల తర్వాత ఆంధ్రా సరిహద్దులకు వెళ్లి ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దని నల్గొండ ఎస్పీ అంటున్నారు. నల్లగొండ జిల్లా మీదుగా మాచర్లకు వెళ్లే మార్గంలో ఉన్న నాగార్జున సాగర్ - మాచర్ల రోడ్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రోడ్డుగా గుర్తించనందున ఆ మార్గంలో ఎలాంటి ప్రజా రవాణా, వాహనాలను ఏపీ పోలీసులు అనుమతించడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సరుకు రవాణా, అత్యవసర సేవల వాహనాలు మినహా మిగిలిన అన్ని ప్రైవేట్ వాహనాలలో ప్రయాణించే వారికి విధిగా పాస్ ఉండాలని, పాస్ లేకుండా ప్రయాణాన్ని వారు అనుమతించడం లేదని ప్రయాణికులకు సూచన చేస్తున్నారు. కాబట్టి ప్రయాణికులు ఆంధ్రాకు వెళ్లే సమయంలో విధిగా పాసులు సంబంధిత అధికారుల నుండి తీసుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక రాత్రి 7 గంటల తర్వాత ప్రయాణికుల్ని పోలీసులు అనుమతించరు.





Untitled Document
Advertisements