రైల్వే ప్రయాణికులకు అలర్ట్...ఆ సర్వీసులు షురూ

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 12:27 PM

రైల్వే ప్రయాణికులకు అలర్ట్...ఆ సర్వీసులు షురూ

రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన అలర్ట్. ఇండియన్ రైల్వేస్ తాజాగా ట్రైన్ జర్నీ చేసే వారికి ప్రయోజనం కలిగేలా ఒక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో తత్కాల్ టికెట్ బుకింగ్ సర్వీసులు నిలిపివేసిన రైల్వేస్ ఇప్పుడు మళ్లీ ఆ సర్వీసులను ప్రారంభించింది. అన్ని స్పెషల్ ట్రైన్స్‌కు ఇది వర్తిస్తుంది.ప్రయాణికులు ఈరోజు నుంచే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. సెంట్రల్ రైల్వేస్ పీఆర్‌వో శివాజీ సుతార్ ఈ విషయాన్ని వెల్లడించారు. తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ సర్వీసులు 200 శ్రామిక్ ట్రైన్స్‌ను అందుబాటులో ఉంటాయని అలాటే అన్ని రాజధాని రైళ్లకు కూడా ఇది వర్తిస్తుందని వివరించారు.ట్రైన్ చేయాలని భావించే వారు ఏసీ ట్రైన్స్‌కు తత్కాల్ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. అదే స్లీపర్ క్లాస్ టికెట్లు అయితే 11 గంటల నుంచి బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్ ద్వారా కూడా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది. ప్రయాణానికి 120 రోజులు ముందుగానే టికెట్లను బుక్ చేసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే.

అంతేకాకుండా ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఏసీ క్లాస్‌లో ప్రయాణించే వారికి ఫ్రెష్ ఎయిర్ అందించేందుకు సిద్ధమైంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఎయిర్ పంప్స్‌ను సెట్ చేస్తోంది. తొలిగా 30 ట్రైన్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా కోచ్‌లో గాలి గంటకు 16 నుంచి 18 సార్లు మారుతూ వస్తుంది. పాత గాలి స్థానంలోకి కొత్త గాలి వచ్చి చేరుతుంది. ఇది వరకు అయితే 6-8 సార్లు మాత్రమే కోచ్‌లో గాలిని మార్చేవారు.





Untitled Document
Advertisements