దారుణం: ఒక్క మేక కోసం 20 వీదికుక్కలకు విషం పెట్టి చంపారు

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 12:46 PM

దారుణం: ఒక్క మేక కోసం 20 వీదికుక్కలకు విషం పెట్టి చంపారు

కేరళలో గర్భిణి ఏనుగు మృతి ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనలో బాధ్యులపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. అయినా కూడా మూగజీవాలపై దాడులు మాత్రం ఆగడం లేదు. జంతువుల్ని పక్షుల్ని అన్యాయంగా కొందరు చంపేస్తున్నారు. ఒడిశాలోని కటక్‌ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు. 20 వీధి కుక్కలకు వారు విషం పెట్టి చంపారు. జూన్‌ 19వ తేదీన అక్కడి భౌన్‌రియా గ్రామ పంచాయతీ పరిధిలోని నహంగా గ్రామంలో బ్రహ్మానంద మల్లిక్‌, అతని మేనల్లుడు భరత్‌ మల్లిక్‌ నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఉన్న 40కు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి హతమార్చారు. వీధికుక్కల్లో ఓ కుక్క వారు పెంచుకుంటున్న ఓ మేకను కరిచింది. దీంతో వారు విషముష్టి అనే చెట్టు బెరడును నీటిలో మరిగించి విషం తయారుచేశారు. దాన్ని మేక, కోడి మాంసాల్లో కలిపి ఆ మాంసం ముక్కలను గ్రామంలో అక్కడక్కడా పెట్టారు. ఈ క్రమంలో ఆ మాంసం ముక్కలను తిన్న ఆ కుక్కలు చనిపోయాయి. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ గగన్‌ బిహారీ సెథి, పలువురు వార్డు మెంబర్లు ఈ విషయంపై వివరాలను వెల్లడించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న బిజు యువ వాహిని అనే ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వాలంటీర్లు ఆ ఇద్దరిపై మహంగ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు.

పోలీసులు ఆ ఇద్దరిపై జంతు హింస చట్టం సెక్షన్లు 428, 429ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రస్తుతానికి నిందితులిద్దరూ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ అమానుష సంఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని, వారు కుక్కలను చంపి ఇన్ని రోజులు అవుతున్నా పోలీసులు ఇంకా నిందితులను ఎందుక అరెస్టు చేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు.






Untitled Document
Advertisements