ఫ్లిప్‌కార్ట్: వెండర్లకి బంపర్ ఆఫర్...48 గంటల్లో లోన్

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 01:30 PM

ఫ్లిప్‌కార్ట్: వెండర్లకి బంపర్ ఆఫర్...48 గంటల్లో లోన్

ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా తన ప్లాట్‌ఫామ్‌పై 90 శాతానికి పైగా వెండర్లు మళ్లీ వారి బిజినెస్ కార్యకలాపాలు ప్రారంభించారని తెలిపింది. ఏప్రిల్ నుంచి వీరు కస్టమర్లకు సేవలు అందిస్తున్నారని పేర్కొంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో కొత్త వెండర్ల పెరుగుదలలో 125 శాతం పెరుగుదల నమోదయ్యిందని తెలిపింది.

కరోనా వైరస్ కారణంగా కంపెనీలు వాటి కార్యకలాపాల నిర్వహణ గురించి ప్రధానంగా ఆలోచిస్తున్నాయని, అలాగే కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఇప్పుడు ఈకామర్స్ నిజమైన విలువను, ప్రాధాన్యతను గుర్తించాయని పేర్కొంది. ఈకామర్స్ ద్వారా MSMEs చాలా మంది కస్టమర్లకు దగ్గరి కావొచ్చని, వారికి సేవలు అందించొచ్చని తెలిపింది.

వెండర్లు ప్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్ ద్వారా జాతీయ స్థాయిలో ఎక్కడికైనా వాటి ప్రొడక్టులను పంపొచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పెద్ద మార్కెట్ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు ప్రాంతాల్లోని ఎంఎప్ఎంఈలు ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయడానికి ఎక్కువ మొగ్గుచూపుతున్నాయని వివరించింది.

అంతేకాకుండా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వెండర్లకు రాయితీ ధరకే కోవిడ్ 19 ఇన్సూరెన్స్ సేవలు కూడా అందిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. రూ.50,000 నుంచి రూ.3 లక్షల వరకు బీమా ప్రయోజనాన్ని కల్పిస్తున్నామని పేర్కొంది. అంతేకాకుండా నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న వెండర్లకు 48 గంటల్లోనే రుణాలు అందేలా చూస్తున్నామని తెలిపింది. ఇంకా లాక్ డౌన్ సమయంలో నష్టపోయిన విక్రేతలకు పరిహారం కూడా అందిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ సెల్లర్ ప్రొటెక్షన్ ఫండ్ నుంచి ఈ ప్రయోజనం కల్పిస్తున్నామని పేర్కొంది.





Untitled Document
Advertisements