ఆడ పిల్ల పుడితే అకౌంట్‌లో రూ.36,000 జమ...అప్లైకి చివరి తేది?!

     Written by : smtv Desk | Mon, Jun 29, 2020, 05:07 PM

ఆడ పిల్ల పుడితే అకౌంట్‌లో రూ.36,000 జమ...అప్లైకి చివరి తేది?!

కరోనా వైరస్ కారణంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా ప్రజలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. లడ్లీ స్కీమ్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు ఒక నోటికేషన్ జారీ చేసింది.
దీంతో ప్రజలకు ఈ స్కీమ్‌లో చేరేందుకు మరింగ గడువు లభించింది. ఆగస్ట్ 31 వరకు ఈ పథకంలో చేరేందుకు అప్లికేషన్స్ సమర్పించొచ్చు. అంతేకాకుండా వితంతువుల ఆడ పిల్లలు, అనాధలైన ఆడ పిల్లలకు అందించే ఆర్థిక చేయూతకు అప్లై చేసుకోవడానికి కూడా అక్కడి ప్రభుత్వం ఆగస్ట్ 31న గడువు నిర్దేశించింది.
ఢిల్లీ గవర్నమెంట్ లడ్లీ స్కీమ్‌ను 2008లోనే ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఆడ పిల్లలకు రూ.35,000 నుంచి రూ.36,000 వరకు ఆర్థిక సాయం అందుతుంది. అమ్మాయి పుట్టిన దగ్గరి నుంచి ఇంటర్ పూర్తి చేసేంత వరకు ఈ డబ్బులు వారి అకౌంట్లలో విడతల వారీగా జమవుతూ వస్తుంది.
2008 జనవరి 1 నుంచి పుట్టిన ఆడ పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అమ్మాయి పుట్టిన వెంటనే రూ.11,000 అందజేస్తారు. హాస్పిటల్‌లో పుడితే ఈ డబ్బులు వస్తాయి. అదే ఇంటి వద్దనే కాన్పు అయితే రూ.10,000 అందజేస్తారు. తర్వాత పాప ఒకటో తరగతి చేరిన వెంటనే రూ.5,000 వస్తాయి. తర్వాత ఆరో తరగతిలో రూ.5,000, 9వ తరగతిలో రూ.5,000, పదో తరగతిలో రూ.5,000, 12వ తరగతిలో రూ.5,000 లభిస్తాయి. మొత్తంగా రూ.35 వేలు లేదా రూ.36 వేలు వస్తాయి.
ఈ స్కీమ్‌లో చేరేందుకు కొన్ని అర్హతులు ఉన్నాయి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష దాటకూడదు. అలాగే దరఖాస్తు చేసుకునేవారు ఢిల్లీలో మూడేళ్లుగా నివాసం ఉండాలి. పాపు ఢిల్లీలోనే జన్మించాలి. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడ పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. తర్వాత పాప ఢిల్లీ ప్రభుత్వపు గుర్తింపు ఉన్న స్కూల్‌లో చదవాలి. ఇకపోతే అమ్మాయికి 18 ఏళ్లు దాటిన తర్వాతనే ఆ డబ్బులు తీసుకోవడం వీలవుతుంది.





Untitled Document
Advertisements