పీఎఫ్ అలెర్ట్: విత్‌డ్రా ఫెసిలిటీకి ఈరోజే గడువు

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 03:09 PM

పీఎఫ్ అలెర్ట్: విత్‌డ్రా ఫెసిలిటీకి ఈరోజే గడువు

ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లకు ముఖ్యమైన గమనిక. ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావించే వారు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ విత్‌డ్రా రూల్స్‌ను సవరించింది. సులభంగానే పీఎఫ్ డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించింది.

అయితే ఇప్పుడు ఈ సదుపాయం అందుబాటులో ఉండకపోవచ్చు. కరోనా వైరస్ ఆప్షన్ కింద పీఎఫ్ డబ్బుల విత్‌డ్రాకు జూన్ 30 డెడ్‌లైన్‌గా ఉంది. అంటే ఈరోజుతో ఈ విత్‌డ్రా సౌకర్యం గడువు ముగియనుంది. ఇప్పటికీ కూడా ఇంకా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకొని వారు వెంటనే ఆ పని పూర్తి చేసుకోవడం మంచిది.రేపటి నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే ఏదో ఒక కారణం చెప్పాల్సి ఉంటుంది. దీనికి మళ్లీ డాక్యుమెంట్లు కూడా అందించాలి. అందువల్ల వల్ల ఈరోజే పీఎఫ్ డబ్బులు కోసం అప్లై చేసుకుంటే మంచిది. కరోనా వైరస్ ఆప్షన్ కింద ఎలాంటి డాక్యుమెంట్లు అందించకుండానే డబ్బులు తీసుకోవచ్చు. అది కూడా కేవలం 3 రోజుల్లోనే మీ పీఎఫ్ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌కు వచ్చి చేరతాయి.
పీఎఫ్ అకౌంట్ కలిగిన వారు కరోనా ఆప్షన్ కింద 3 నెలల బేసిక్ శాలరీ, డీఏ లేదా పీఎఫ్ అకౌంట్‌లో జమైన 75 శాతం మొత్తంలో ఏది తక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పే స్లిప్ లేదా శాలరీ స్లిప్‌లో బేసిక్ వేతనం, డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) వివరాలు ఉంటాయి. వీటి ఆధారంగా మీకు ఎంత పీఎఫ్ డబ్బు వస్తుంతో చూసుకోవచ్చు.





Untitled Document
Advertisements