పాలసీదారులకు ఝలక్...పెరగనున్న రేట్లు!

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 04:50 PM

పాలసీదారులకు ఝలక్...పెరగనున్న రేట్లు!

కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు ఝలక్. కోవిడ్ 19 కారణంగా రానున్న రోజుల్లో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం మొత్తం పెరిగనుంది. టర్మ్ ప్లాన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులపై ప్రీమియం ఏకంగా 30 శాతం వరకు పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొడక్టులు ప్రియం కానున్నాయి. వీటి ప్రీమియం 30 శాతం వరకు పెరగొచ్చు. అదే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం 20 నుంచి 25 శాం వరకు పైకి చేరొచ్చు. కరోనా వైరస్ తర్వాత వ్యాధి ప్రబలత రిస్క్ పెరిగిపోవడం, ఇంకా రెగ్యులేటరీ కాంప్లియెన్స్ కాస్ట్ పైకి చేరడం వంటి అంశాలు ఇందుకు కారణంగా నిలువనున్నాయి.ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ నేపథ్యంలో పెరిగిన వ్యయాలను కస్టమర్లకు బదిలీ చేయొచ్చు. ఇప్పటికే కంపెనీలపై మార్జిన్ ఒత్తిడి కూడా నెలకొంది. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి కూడా ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను ప్రతి ఏడాది రెన్యూవల్ చేసుకోవలసి ఉంటుంది. ఇలాంటప్పుడు రీఇన్సూరెన్స్ రేట్లు కూడా పెరిగే అవకావముందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తే.. ఇప్పుడే త్వరపడటం మంచిది. లేదంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు.





Untitled Document
Advertisements