బంగార ధర పైకి...వెండిదీ ఇదే దారి

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 06:07 PM

బంగార ధర పైకి...వెండిదీ ఇదే దారి

పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధర ఈరోజు కూడా పైకి కదిలింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర పరుగులు పెడితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పైకి కదిలింది. దీంతో ధర రూ.46,450కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.40 పెరుగుదలతో రూ.50,660కు ఎగసింది. ఇది బంగారానికి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి.
పసిడి ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.390 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,500కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. పసిడి ధర ఔన్స్‌కు 0.11 శాతం పెరిగింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1783 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.10 శాతం పెరుగుదలతో 18.08 డాలర్లకు ఎగసింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో పసిడి ధర ర్యాలీ చేసింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,250కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగింది. రూ.40 పెరుగుదలతో రూ.48,450కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.390 పెరిగింది. రూ.48,500కు చేరింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.





Untitled Document
Advertisements