కరోనా వ్యాక్సిన్‌పై మోదీ 4 సూచనలు!

     Written by : smtv Desk | Tue, Jun 30, 2020, 06:16 PM

కరోనా వ్యాక్సిన్‌పై మోదీ 4 సూచనలు!

దేశంలో కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ సన్నద్ధతపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాక్సినేషన్‌పై కీలక సూచనలు చేశారు. పెద్ద ఎత్తున టీకా పంపిణీ కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. భారత్‌ సహా వివిధ దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రయత్నాలపై చర్చించారు.
దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకా అందేందుకు ప్రధాని నాలుగు మార్గదర్శకాలను సూచించారు. వ్యాక్సినేషన్‌లో కీలకమైన మెడికల్సరఫరా గొలుసు, ముందు ఎవరికి ఇవ్వాలి, వివిధ విభాగాల మధ్య సమన్వయం చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు విభాగాలు, పౌరుల పాత్ర వంటి వాటిపై అధికారులతో ప్రధాని సమీక్షించారు.
తొలి సూచన:
కరోనా వైరస్ బారిన పడేందుకు అధికంగా ముప్పు ఉన్న వారిని గుర్తించి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, వైద్యేతర కరోనా యోధులు, ముప్పు పొంచి ఉన్న ప్రజలకు ముందుగా ఇవ్వాలని మోదీ తొలి సూచన చేశారు.

రెండో సూచన:
టీకా ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలి. దేశంలో ఎవరెక్కడున్నా ఆ ప్రాంతానికి వాక్సిన్ సరఫరా చేయాల్సిందే. టీకా పంపిణీకి అడ్డుపడేలా ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు.

మూడో సూచన:
టీకా అందరికీ అందేలా సరసమైన ధరలో అందుబాటులో ఉండేలా చూడాలి. ఎవరూ టీకాకు దూరం కాకూడదు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.


నాలుగో సూచన:
వాక్సిన్ ఉత్పత్తి నుంచి.. పంపిణీ వరకు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిత్యం పర్యవేక్షణ ఉండాలి. అందుకు తగిన విధంగా చర్యలు చేపట్టాలి. నిర్ణీత సమయంలో సమర్థంగా టీకాలు వేసేందుకు వివిధ సాంకేతిక సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలి.





Untitled Document
Advertisements