చైతూ, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’కి కొత్త చిక్కులు

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 12:49 PM

చైతూ, సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’కి కొత్త చిక్కులు

‘ఫిదా’ చిత్రంలో కుర్ర హృదయాలను కొల్లగొట్టేసింది సాయి పల్లవి. భానుమతి ఒక్కటే పీస్ అంటూ తెలంగాణ యాస, భాషల్లో ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆమెలోని సహజ నటనను ‘ఫిదా’ మరింత మెరుగు పెట్టిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. తాజాగా నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో ‘లవ్ స్టోరీ’ అనే బ్యూటిఫుల్ ప్రేమకథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫీల్ గుడ్ కథలను తనదైన కోణంలో మలిచి యూత్ ఆడియన్స్‌ని ఆకర్షించే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఫిదా చిత్రం తరువాత సాయి పల్లవిని ‘లవ్ స్టోరీ’ చిత్రంతో రిపీట్ చేశారు శేఖర్ కమ్ముల.
అక్కినేని నాగచైతన్యకు ఇది 19వ మూవీ కాగా.. సంక్రాంతి నాడు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత విడుదలైన ‘ఏ పిల్లా’ అనే లిరికల్ సాంగ్‌ యూత్‌ని ఆకట్టుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోగా.. వీరి కాంబోకి ఉన్న క్రేజ్‌తో శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుకావడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. శాటిలైట్ రైట్స్‌ని ప్రముఖ ఛానల్‌కు భారీ ధరకు దక్కించుకోగా.. మొత్తంగా లవ్ స్టోరీ చిత్రానికి శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కులు అన్నీ కలుపుకుని రూ. 18 కోట్లకు వరకూ రేటు పలికినట్టు తెలుస్తోంది.
అయితే కరోనా ఎఫెక్ట్ ఈ చిత్రం బిజినెస్ డీలింగ్స్‌పై పడినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి మంచి హైప్ ఉండటంతో సెట్స్‌పైకి రాగానా అన్ని ఏరియాల నుంచి మంచి బిజినెస్ డీలింగ్స్ పొందారట నిర్మాత నారాయణదాస్ నారంగ్. చాలా వరకూ బయ్యర్లు అడ్వాన్స్‌లు ఇచ్చారట. అయితే కరోనా ప్రభావంతో అన్ని చిత్రాల మాదిరిగానే ఈ సినిమా షూటింగ్, విడుదల అంతా గందరగోళంగా మారడంతో బయ్యర్లు రిస్క్ చేయకుండా అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారట. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉండగా.. అప్పటికి పరిస్థితులు చక్కబడతాయేమో చూడాలి.





Untitled Document
Advertisements