ఎస్‌బీఐ ఖాతాదారులకు ఝలక్...నేటి నుంచి మళ్లీ ఆ రూల్ వర్తింపు

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 01:34 PM

ఎస్‌బీఐ ఖాతాదారులకు ఝలక్...నేటి నుంచి మళ్లీ ఆ రూల్ వర్తింపు

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో మీకు అకౌంట్ ఉందా? అయితే మీకు ముఖ్యమైన అలర్ట్. జూలై 1 నుంచి ఏటీఎం క్యాస్ విత్‌డ్రా రూల్స్ మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఊరట నేటి నుంచి ఇక అందుబాటులో ఉండదు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏటీఎం చార్జీలను తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బెనిఫిట్ ఉండదు.

ఎస్‌బీఐ కస్టమర్లు ఏటీఎం లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి దాటితే మళ్లీ చార్జీల బాదుడు ప్రారంభమౌతుంది. అందువల్ల ఎస్‌బీఐ ఏటీఎం లేదా మరే ఇతర బ్యాంక్ ఏటీఎం నుంచైనా డబ్బులు విత్‌డ్రా చేసేటప్పుడు లిమిట్స్‌ను కూడా గుర్తుపెట్టుకోండి.స్టేట్ బ్యాంక్ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం.. మెట్రో నగరాల్లోని బ్యాంక్ కస్టమర్లు అక్కడ నెలలో 8 వరకు లావాదేవీలను ఉచితంగానే నిర్వహించొచ్చు. అయితే ఏటీఎంలలో ఈ లిమిట్ దాటితే మాత్రం చార్జీలు పడతాయి. రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ కలిగిన వారికి ఇది వర్తిస్తుంది.

మెట్రో నగరాల్లోని ఎనిమిది ఉచిత ట్రాన్సాక్షన్లలో 5 ట్రాన్సాక్షన్లు ఎస్‌బీఐ ఏటీఎంలో నిర్వహించొచ్చు. ఇక మిగతా 3 ట్రాన్సాక్షన్లను ఇతర బ్యాంక్ ఏటీఎంలలో నిర్వహించొచ్చు. అదే నాన్ మెట్రో పట్టణాల్లో అయితే 10 వరకు ఏటీఎం లావాదేవీలు ఉచితం. ఐదు ట్రాన్సాక్షన్లను ఎస్‌బీఐ ఏటీఎంలో నిర్వహించొచ్చు. ఇక మిగతా ఐదు ట్రాన్సాక్షన్లను ఇతర బ్యాంకుల ఏటీఎంలలో చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements