కొత్తగూడెం: సింగరేణి సీఎండీ శ్రీధర్పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కేసు నమోదు చేసింది. సీఎండీతో పాటు చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, జీఎం ఎస్టేట్స్, కొత్తగూడెం జీఎంపైనా కేసు నమోదైంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో రూ.200 కోట్ల డీజిల్ కుంభకోణం జరిగిందని.. ఓ కార్మిక సంఘం విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన సింగరేణి విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఇందులో సింగరేణి సీఎండీ పాత్ర ఉందని తేలినట్లు సమాచారం. గతంలో శ్రీరాంపూర్ జీఎం సుభానీపైనా సింగరేణి విజిలెన్స్ కేసు నమోదు చేసింది.
మే నెల 12వ తేదీన కూడా సింగరేణి సీఎండీపై కేసు నమోదైంది. 2017 వరకు అప్పటి ఉద్యోగి ప్రేమ్ కుమార్, ఫైనాన్స్ జీఎం వెంకట రమణ సహకారంతో శ్రీధర్ దశల వారీగా రూ.16లక్షలను డ్రా చేశారని ఆరోపిస్తూ.. సింగరేణి మాజీ ఉద్యోగి సంపత్ కుమార్ కొత్తగూడెం కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టాల్సిందిగా న్యాయస్థానం వన్టౌన్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
మే నెల 12వ తేదీన కూడా సింగరేణి సీఎండీపై కేసు నమోదైంది. 2017 వరకు అప్పటి ఉద్యోగి ప్రేమ్ కుమార్, ఫైనాన్స్ జీఎం వెంకట రమణ సహకారంతో శ్రీధర్ దశల వారీగా రూ.16లక్షలను డ్రా చేశారని ఆరోపిస్తూ.. సింగరేణి మాజీ ఉద్యోగి సంపత్ కుమార్ కొత్తగూడెం కోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టాల్సిందిగా న్యాయస్థానం వన్టౌన్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.