ఐఫోన్‌పై ఏకంగా రూ.40 వేలు తగ్గింపు!

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 03:13 PM

ఐఫోన్‌పై ఏకంగా రూ.40 వేలు తగ్గింపు!

యాపిల్ ఐఫోన్ Xs మ్యాక్స్ ఫోన్ పై భారీ ధర తగ్గింపు లభించింది. లాంచ్ అయినప్పుడు ఈ ఫోన్ 64 జీబీ వేరియంట్ ధర రూ.1,09,900కాగా, అమెజాన్ లో ప్రస్తుతం రూ.69,900కే అందుబాటులో ఉంది. ఇందులోనే 256 జీబీ వేరియంట్ పై రూ.24,990 తగ్గింపు లభించగా, 512 జీబీ వేరియంట్ పై ఎటువంటి తగ్గింపూ అందుబాటులో లేదు.
అయితే ఈ ఆఫర్ ఎన్ని రోజులు అందుబాటులో ఉండనుందో తెలియలేదు. కాబట్టి ఈ ఫోన్ కొనాలనుకుంటే వెంటనే కొనడం మంచిది. ఈ ఫోన్ గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ రూ.40,000 డిస్కౌంట్ గోల్డ్ కలర్ వేరియంట్ పై అందుబాటులో ఉంది. గ్రే కలర్ వేరియంట్ పై రూ.36,300 డిస్కౌంట్ అందించారు. దీంతో దీని ధర రూ.1,05,200 నుంచి రూ.68,900కు తగ్గింది.

ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.5 అంగుళాల సూపర్ రెటీనా ఓఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలను ఇందులో వెనకవైపు అందించారు. ముందువైపు 7 మెగా పిక్సెల్ ట్రూ డెప్త్ సెన్సార్ ఉంది.
ఏ12 బయోనిక్ చిప్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ ను ఇందులో అందించారు. ఐవోఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. అయితే ఐవోఎస్ 13, త్వరలో రానున్న ఐవోఎస్ 14కు కూడా అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఫోన్ బరువు 208 గ్రాములుగా ఉంది.





Untitled Document
Advertisements