ట్రోలింగ్ పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరుణ్ భాస్కర్

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 04:48 PM

ట్రోలింగ్ పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరుణ్ భాస్కర్

ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రతీ ఒకరు యాక్టివ్‌గా ఉంటున్నారు. చదువు కుంటున్న స్టూడెంట్స్ దగ్గర నుంచి సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల వరకు ప్రతీ ఒకరికి సోషల్ మీడియాలో తప్పకుండా ఎకౌంట్లు ఉంటున్నాయి. దీంతో వారంతా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇనస్టాగ్రాముల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ వ్యక్తిగత విషయాలతో పాటు.. సామాజిక అంశాలపైన కూడా అందరూ తమ తమ అభిప్రాయల్ని షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సెలబ్రిటీలు

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు ఇప్పుడు ఇదే సమస్య ఎదురైంది.

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు తరుణ్ భాస్కర్ మలయాళ సినిమా కప్పెలపై తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇందులో హీరో అరవడాలు లేవు, మాస్ అప్పీల్ లేదు. అనవసరపు సన్నివేశాలు లేవు అంటూ పెద్ద పోస్ట్ పెట్టాడు. అయితే కొందరు అభిమానులు తరుణ్ భాస్కర్‌.. తమ హీరోను ఉద్దేశించే ఆ పోస్ట్ పెట్టాడని భావించి సోషల్ మీడియా వేదికగా తరుణ్ పై ట్వీట్స్ దాడి మొదలు పెట్టారు. దీంతో ట్రోలింగ్ పై తరుణ్ భాస్కర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కొందరు నెటిజన్స్ తనను దుర్భాషలాడడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని తరుణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తనని వేధించిన వారి ఫోన్ నెంబర్స్‌, ఐడీలు సైబర్ పోలీసులకి అందించారు. గచ్చిబౌలి పోలీసులు తన ఫిర్యాదుని స్వీకరించినట్టు తరుణ్ భాస్కర్ పేర్కొన్నారు. పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది అనే ప్రయోగాత్మక చిత్రం చేశారు. ఇక గత ఏడాది మీకు మాత్రమే చెప్తా అనే చిత్రంతో హీరోగా కనిపించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements