ప్రియాంకాకు కేంద్ర ప్రభుత్వం షాక్..బంగ్లా ఖాళీ చేయమంటూ డిమాండ్!

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 08:18 PM

ప్రియాంకాకు కేంద్ర ప్రభుత్వం షాక్..బంగ్లా ఖాళీ చేయమంటూ డిమాండ్!

కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీకి కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఢిల్లీలో లోథీ రోడ్‌లో ఆమె నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆమెను కోరింది. ఈ మేరకు బుధవారం (జులై 1) ఆమెకు లేఖ రాసింది. ప్రియాంక గాంధీ ఎస్పీజీ భద్రత పరిధిలో లేనందున 35, లోడీ ఎస్టేట్స్‌ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని కోరింది. ఆగస్టు 1లోగా బంగ్లా ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. అంతకంటే ముందు పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని పేర్కొంది.
2020 జూన్ 30 నాటికి ప్రియాంక గాంధీ రూ.3,46,677 పెండింగ్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. బంగ్లా ఖాళీ చేయడానికి ముందే ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ప్రియాంక గాంధీ వాద్రా ఆగస్టు 1 తర్వాత కూడా ప్రభుత్వ బంగ్లాలో కొనసాగితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పట్టణ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ రాసిన లేఖలో వెల్లడించారు.
ప్రియాంక గాంధీకి ఎస్‌పీజీ భద్రతను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె భద్రతను జడ్ ప్లస్ కేటగిరీకి తగ్గించారు.





Untitled Document
Advertisements