కీలక నిర్ణయం తీసుకున్న ఏపీఎస్ ఆర్టీసీ

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 12:17 PM

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీఎస్ ఆర్టీసీ

లాక్‌డౌన్ దెబ్బ ఏపీఎస్ ఆర్టీసీకి గట్టిగానే తగిలింది. దాదాపు రెండు నెలలకుపైగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ఆర్టీసీకి భారీగా నష్టం వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుస్తున్నా.. ఆదాయం అంతంతమాత్రంగానే ఉంది. ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు ఆలోచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పరిస్థితి కూడా అలాగే ఉంది. కేవలం కర్ణాటక, ఒడిశాకు మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. దీంతో ఆర్టీసీ ప్రత్నామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టింది.
ఆర్టీసీ కార్గో సర్వీసుల సంఖ్యను పెంచుతోంది. లాక్‌డౌన్‌ ముందు కొరియర్, పార్శిల్‌ సేవల ద్వారా ఆర్టీసీ అదనపు ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్‌ దెబ్బకు ఆర్టీసీ సర్వీసుల్ని నిలిపివేసింది. దీంతో ఆదాయాన్ని కోల్పోయింది. మళ్లీ దాన్ని పూడ్చేందుకు కార్గో సర్వీసుల్ని మరింతగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఆర్టీసీ విజయవాడ జోన్‌ పరిధిలో కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు. మిగిలిన చోట్లా సర్వీసులు పెంచాలని భావిస్తున్నారు.

కొన్ని బస్సుల్ని కార్గో సర్వీసులుగా మార్చేస్తోంది ఆర్టీసీ. వీటిలో కొన్నింటిని ఓపెన్‌ లారీలుగా మార్చారు. కార్గో రవాణాకు డిమాండ్‌ ఉండడంతో అధికారులు మరిన్ని సర్వీసుల్ని పెంచనున్నారు. అంతేకాదు కార్గోకు డిమాండ్ పెరగడంతో మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, మార్క్‌ఫెడ్, విద్యాశాఖలతో సరకు రవాణా ఒప్పందాలు జరిగాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన తొలివిడత పాఠ్య, నోట్‌ పుస్తకాలను ఆర్టీసీ కార్గో ద్వారానే రవాణా చేశారు.

మరోవైపు ఎరువులు, సిమెంట్, పౌరసరఫరాల శాఖ సరకుల రవాణా ఆర్డరు పొందడానికి సంబంధిత సంస్థలు, కంపెనీలు, అధికారులను సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. కార్గో సేవలు కావాల్సిన వాళ్లు ఏటీఎం కమర్షియల్, కృష్ణా : 7331147264.. ఏటీఎం కమర్షియల్, గుంటూరు : 7331147265.. ఏటీఎం కమర్షియల్, పశ్చిమ గోదావరి : 7331147263.





Untitled Document
Advertisements