మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి కేంద్రం షాక్

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 02:48 PM

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి కేంద్రం షాక్

మ్యూచువల్ ఫండ్స్‌కు ఇటీవల కాలంలో ఆదరణ బాగా పెరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ప్రచారం సహా ప్రజల్లో అవగాహన పెరగడం ఇందుకు ప్రధాన కారణం. మ్యూచువల్ ఫండ్స్‌లో (MF)లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే సిప్ రూపంలో ప్రతి నెలా కొంత మొత్తా్న్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. స్టాక్ మార్కెట్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేయలేని వారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు.

అయితే కేంద్ర ప్రభుత్వం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి భారీ షాకిచ్చింది. స్టంప్ డ్యూటీ అమలులోకి తీసుకువచ్చింది. జూలై 1 నుంచి ఇది ప్రారంభమైంది. అంటే జూలై 1 నుంచి కొనుగోలు చేసే మ్యూచువల్ ఫండ్స్‌కు స్టంప్ డ్యూటీ పడుతుంది. దీంతో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం పడనుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి స్టంప్ డ్యూటీ 0.005 శాతంగా పడుతుంది. అంటే మీరు రూ.లక్ష మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. అప్పుడు మీకు స్టంప్ డ్యూటీ రూ.100 పడుతుంది. ఇది వరకు ఇలా ఉండేది కాదు. ఇప్పుడు జూలై 1 నుంచి ఈ స్టంప్ డ్యూటీ పడుతూ వస్తోంది.

ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే.. ఒక డీమ్యాట్ అకౌంట్ నుంచి మరో డీమ్యాట్ అకౌంట్‌కు బదిలీ చేసుకుంటే.. అప్పుడు స్టంప్ డ్యూటీ 0.015 శాతంగా పడుతుంది. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు ఒక ఊరట మాత్రం లభించిందని చెప్పుకోవచ్చు.


స్టంప్ డ్యూటీ అనేది మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయిస్తే మాత్రం వర్తించదు. ఒకవేళ మీకు డివిడెంట్ వస్తే.. దీన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేస్తే.. టీడీఎస్ కట్ అయిన తర్వాత మిగిలిన మొత్తంపై స్టంప్ డ్యూటీ పడుతుంది.





Untitled Document
Advertisements