ఖైరతాబాద్: 27 అడుగుల ఎత్తు, పూర్తిగా మట్టితో గణపతి విగ్రహం!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 03:55 PM

ఖైరతాబాద్: 27 అడుగుల ఎత్తు, పూర్తిగా మట్టితో గణపతి విగ్రహం!

వినాయక చవితి పండుగ దగ్గర పడిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి ఖైరతాబాద్ వినాయకుడి వైపు మళ్లుతుంది. భారీ ఎత్తుతో.. విభిన్న ఆకృతిలో కొలువు దీరే ఈ గణపతిని దర్శించుకోవడం కోసం ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులు, సందర్శకులతో కిటకటలాడతాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు.

కరోనా వైరస్ ప్రభావంతో ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 27 అడుగులతో ధన్వంతరి వినాయకుణ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పూర్తిగా మట్టితో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ భావిస్తోంది. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలని యోచిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కూడా దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ప్రభుత్వ అనుమతి తీసుకొని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది.

గత ఏడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకున్నాడు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది ఒకే అడుగు ఎత్తు ఉన్న వినాయకుణ్ని ఏర్పాటు చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. కానీ 27 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.





Untitled Document
Advertisements