టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా ఇంచార్జిగా ఆర్‌జేసీ కృష్ణ

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 07:09 PM

టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా ఇంచార్జిగా ఆర్‌జేసీ కృష్ణ

టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా ఇంచార్జిగా ఆర్‌జేసీ కృష్ణను పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ నియమించారు. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఆర్‌జేసీ కృష్ణను జిల్లా పార్టీ కార్యాలయ ఇంఛార్జిగా నియమించినట్లు మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. తనను ఇంచార్జిగా నియమించిన మంత్రులు, కేటీఆర్, అజయ్ కుమార్‌కు కృష్ణ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు. ఈ వానాకాలంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. హ‌రితహారంలో భాగంగా ఖైర‌తాబాద్‌లోని డా.బిఆర్‌ అంబేడ్కర్ ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్‌లో ఆయన మొక్కలు నాటారు. ప్రజలంతా మొక్కలు నాటి హరిత హారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.





Untitled Document
Advertisements