ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకు కరోనా!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 08:16 PM

ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకు కరోనా!

కరోనా బారిన పడి కోలుకున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు విధుల్లోకి చేరారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్, శిఖా గోయల్, తరుణ్ జోషి కొన్నాళ్ల క్రితం కరోనా బారిన పడ్డారు. ఈ ముగ్గురు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందారు. చికిత్స పూర్తయిన తర్వాత గురువారం తిరిగి విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తిరిగి డ్యూటీ లో చేరుతున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులకు హైదరాబాద్ పోలీసులు ఘన స్వాగతం పలికారు. 500 మంది వివిధ స్థాయిల్లోని అధికారులు ఏకకాలంలో వీరికి స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ...కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని, కరోనాకు నివారణ మార్గం ఒకటేనని అన్నారు. అందరూ పరిశుభ్రత పాటించాలని కోరారు. డ్యూటీలో చేరుతున్న ముగ్గురు అధికారులకి అభినందనలు తెలిపి ప్రత్యేకంగా ప్రశంస పత్రాన్ని అందజేశారు.

సెంట్రల్ యూనివర్శిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ షూటింగ్ రేంజ్‌లకు, ముగ్గురు సీనియర్ ఆఫీసర్లు శిఖా గోయెల్, అడిషినల్ సీపీ క్రైమ్, డీఎస్.చౌహాన్, అడిషనల్ సీపీ, ఎల్ అండ్ ఓ, తరుణ్ జోషి, జాయింట్ సీపీ పాల్గొన్నారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కోవిడ్ 19 వైరస్‌ను జయించి, షూటింగ్ ఫైరింగ్ ప్రాక్టీస్‌లో గురువారం పాల్గొన్నారు.

వీరిని అంజనీ కుమార్ స్వాగతిస్తూ వారితో కేక్ కట్ చేయించి బహుమతి అందించారు. విజయవంతంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్నందుకు, విధుల్లో తిరిగి చేరినందుకు తోటి అధికారులను అభినందించారు. అంతేకాకుండా హైదరాబాద్ లోని స్పోర్ట్స్ షూటింగ్ రేంజ్ లో వార్షిక కాల్పుల అభ్యాసానికి నగర పోలీసులకు చెందిన పోలీసు అధికారులు పాల్గోన్నారు.








Untitled Document
Advertisements