రష్యా నుంచి రూ.38,900 కోట్లతో ఆయుధాలు కొన్న భారత్

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 09:33 PM

రష్యా నుంచి రూ.38,900 కోట్లతో ఆయుధాలు కొన్న భారత్

సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యానికి ఆధునిక అస్త్రాలను సమకూర్చే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 సంక్షోభంలోనూ ఇందుకోసం భారీగా కేటాయింపులు చేసింది. రూ.38,900 కోట్లతో ఆధునిక యుద్ధ విమానాల కొనుగోలుతో పాటు క్షిపణి వ్యవస్థల తయారీకి డీఆర్‌డీవోకు నిధులు కేటాయించింది.



అస్త్రాలను మెరుగుపరుచుకునే చర్యల్లో భాగంగా రష్యా నుంచి 33 యుద్ధ విమానాల కొనుగోలు చేయడానికి రక్షణ శాఖ పచ్చజెండా ఊపింది. వీటిలో 12 సుఖోయ్ ఎస్‌యూ -30 ఎంకేయూ ఫైటర్‌జెట్లు, 21 మిగ్-29 ఫైటర్‌‌‌జెట్లు ఉన్నాయి. వీటితో పాటు మరో 59 మిగ్-29 యుద్ధ విమానాల ఆధునికీకరణకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.18,148 కోట్లుగా రక్షణ శాఖ తెలిపింది.

వీటితో పాటు వాయుసేన, నౌకాదళం కోసం గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను కూల్చే 248 అస్త్ర బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ క్షిపణులను కొనుగోలు చేయాలని రక్షణ శాఖ నిర్ణయించింది. భూమిపై నుంచి 1000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేధించే క్షిపణుల తయారీకి డీఆర్‌డీవోకి అనుమతి ఇచ్చింది.





Untitled Document
Advertisements