షాకింగ్: తులం బంగారం ధర...రూ.లక్షకు పైనే..!

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 11:16 AM

షాకింగ్: తులం బంగారం ధర...రూ.లక్షకు పైనే..!

బంగారం ధర పరుగులు పెడుతోంది. ఇప్పటికే రికార్డ్ స్థాయికి చేరింది. భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పటికే రూ.50 వేలు దాటిపోయింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మన దేశంలో బంగారం ధర రూ.50 వేలు దాటితేనే వామ్మో అనుకుంటున్నాం. ఇక్కడ బంగారం ధర ఎంత ఉందో తెలిస్తే షాక్ అవుతాం.
అవును బంగారం ధర అక్షరాల రూ.లక్ష దాటింది. అయితే ఇది మనదేశంలో కాదు. పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్థాన్‌లో. పాక్‌లో తులం బంగారం ధర రూ.లక్ష మార్క్‌ను దాటేసింది. బంగారం ధర రూ.లక్ష దాటడం ఇదే తొలిసారి. పాకిస్థాన్‌లో బంగారం ధర రూ.1,05,200కు చేరింది.
పాకిస్థాన్ బంగారం కొనుగోలు మాటను సామాన్యులు మరిచిపోవాల్సిందే. కరోనా వైరస్ కారణంగా నెలకొన్న పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుతూ వస్తోంది. ఈ ప్రభావం ఇతర దేశాలన్నింటిపైనా పడుతోంది.

బంగారం ధర భారీగా పెరిపోవడంతో డిమాండ్ కరువయ్యింది. అలాగే ఫెడరల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ గోల్డ్ జువెలరీ అమ్మకాలపై భారీగా పన్ను విధించడంతో అక్కడి గోల్డ్ మార్కెట్‌‌లో కూడా పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్రేడర్లు ధర్నా చేయాలని యోచిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ రూపాయి కూడా పడిపోతూ వస్తోంది. ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగిపోయింది.





Untitled Document
Advertisements