కరోనా నుంచి కోలుకున్న 71 ఏళ్ల వీహెచ్..

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 11:59 AM

కరోనా నుంచి కోలుకున్న 71 ఏళ్ల వీహెచ్..

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కరోనా వైరస్‌ను జయించారు. 71 ఏళ్ల వీహెచ్‌కు షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ పది రోజుల్లోనే కోవిడ్ నుంచి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో జూన్ 21న వీహెచ్ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఆయన భార్యకు కోవిడ్ టెస్టులు చేయగా ఆమెకు కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కూడా అపోలో హాస్పిటల్‌లోనే చేరారు. వీహెచ్ భార్య కూడా కరోనా నుంచి కోలుకున్నారు.
హాస్పిటల్‌లో జ్వరం, దగ్గు తగ్గడానికి మందులు ఇచ్చారని ఆక్సిజన్ కూడా అవసరమైందని వీహెచ్ తెలిపారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు శాకాహారం తీసుకున్నానన్నారు. రోజూ మార్నింగ్ వాక్ చేయడం తనకు అలవాటన్న వీహెచ్.. మానసికంగా ధైర్యంగా ఉండటం అవసరమన్నారు. కరోనా విషయంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తన మిగిలిన జీవితాన్ని బడుగు బలహీన వర్గాలను ఏకం చేయడం కోసం కేటాయిస్తానని తెలిపారు. హాస్పిటల్‌లో ఉన్న సమయంలోనూ ఆయన బీసీల తరఫున గళం వినిపించారు. ఆయన ఇచ్చిన ఆడియో సందేశం వైరల్ అయ్యింది. తన ఆరోగ్యం మెరుగుపడాలని, కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.





Untitled Document
Advertisements