ఎన్‌పీఎస్ స్కీమ్: రోజుకు రూ.200తో చేతికి రూ.45 లక్షలు!

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 01:01 PM

ఎన్‌పీఎస్ స్కీమ్: రోజుకు రూ.200తో చేతికి రూ.45 లక్షలు!

డబ్బు సంపాదించాలని యోచిస్తున్నారా? అయితే మీకు ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే రిస్క్ లేకుండా రాబడి పొందాలంటే మాత్రం జాగ్రత్త ఇన్వె్స్ట్ చేయాలి. కేవలం కొన్ని స్కీమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) కూడా ఒకటి.

ఎన్‌పీఎస్ స్కీమ్‌లో రెండు రకాల అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. ఒకటి కచ్చితంగా తెరవాలి. రెండోదేమో ఆప్షనల్. వీటిని టైర్ 1, టైర్ 2 అకౌంట్లు అని పిలుస్తారు. టైర్ 1 అకౌంట్ ఉన్న వారు టైర్ 2 అకౌంట్‌ను తెరవొచ్చు. 18 నుంచి 65 ఏళ్ల మధ్యలో ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు.
ఎన్‌పీఎస్ స్కీమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బును పీఎఫ్ఆర్‌డీఏ రిజిస్టర్డ్ పెన్షన్ ఫండ్ మేనేజర్లు ఈక్విటీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్, నాన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఈ స్కీమ్‌లో జూలై 31లోపు చేరితే పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు.

ఈ స్కీమ్‌లో చేరడం వల్ల అదిరిపోయే రాబడి ఎలా పొందాలో చూద్దాం. 30 ఏళ్ల వయసులో ఉన్న వారు రోజుకు రూ.200 లేదా నెలకు రూ.6,000 ఇన్వెస్ట్ చేస్తూ వెళాలి. ఇలా 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసాగించాలి. మీరు మొత్తంగా 21.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. 8 శాతం రాబడి ప్రకారం చూస్తే మెచ్యూరిటీలో రూ.90 లక్షలు వస్తాయి. ఇందులో 40 శాతం మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్‌ కొనుగోలు చేయాలి. మిగతా మొత్తాన్ని (రూ.45 లక్షలు) విత్‌డ్రా చేసుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్‌పై 6 శాతం వడ్డీ వస్తుంది. యాన్యుటీ ప్లాన్ ద్వారా 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.22,500 పెన్షన్ తీసుకోవచ్చు.





Untitled Document
Advertisements