వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసిన జియో

     Written by : smtv Desk | Fri, Jul 03, 2020, 06:36 PM

వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసిన జియో

జూమ్ యాప్ కు పోటీగా రిలయన్స్ జియో కొత్త వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసింది. అదే జియోమీట్ యాప్. ఈ యాప్స్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఇతర వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ లతో జియోమీట్ పోటీ పడనుంది.
జియోమీట్ డైరెక్ట్ కాల్స్ తో పాటు.. 100 మంది సభ్యులతో జరిగే మీటింగ్ కాల్స్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. మీ ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీతో లాగిన్ కావచ్చు. హెచ్ డీ క్వాలిటీని ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఉచిత యాప్ కాబట్టి మీరు ఒకేరోజు ఎన్ని మీటింగ్స్ అయిన చేసుకోవచ్చు. జూమ్ తరహాలో ఈ మీటింగ్ లకు కూడా పాస్ వర్డ్ పెట్టుకోవచ్చు. వెయిటింగ్ రూమ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

రిలయన్స్ జియో దీని కోసం ఈ నెల ఏప్రిల్ నుంచి నిధులు సమీకరిస్తోంది. ఫేస్ బుక్ తో డీల్ కూడా ఇందులో భాగమే. జియోలో 9.99 శాతాన్ని ఫేస్ బుక్ చేసింది. ప్రస్తుతానికి ఈ సేవలను యాప్ ద్వారా, బ్రౌజర్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే విండోస్, మ్యాక్ ల్లో కూడా దీన్ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

దీని యూజర్ ఇంటర్ ఫేస్ చాలా సింపుల్ గా ఉంటుంది. చూడటానికి జూమ్ తరహాలో ఉంటుంది. కానీ దీన్ని ఉపయోగించడం ప్రారంభిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాప్స్ లోని కీలక ఫీచర్లన్నీ ఇందులో ఉంటాయి. మల్టీ డివైస్ లాగిన్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. 5 డివైసెస్ వరకు దీన్ని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు కాల్ మాట్లాడేటప్పుడు డివైస్ లను కూడా మార్చవచ్చు. ఇందులో సేఫ్ డ్రైవింగ్ మోడ్, స్క్రీన్ షేరింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.








Untitled Document
Advertisements