రోజాతో మెగాస్టార్‌ ...సూపర్ హిట్ కాంబో!!

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 11:19 AM

రోజాతో మెగాస్టార్‌ ...సూపర్ హిట్ కాంబో!!

మెగాస్టార్ చిరంజీవి, రోజా మరోసారి తెర పంచుకోబోతున్నారని తెలుస్తుండటం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఆ తర్వాత మళయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రోజాతో స్పెషల్ రోల్ చేయించేలా పక్కాగా ప్లాన్ చేశారట చిరంజీవి.
ఈ మేరకు రోజాతో డీల్ కుదుర్చుకున్నట్లు ఫిలిం నగర్‌లో బలమైన టాక్ వినిపిస్తోంది. ఇటీవలే 'లూసిఫర్' తెలుగు రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. ఇదే బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాణంలో అతిత్వరలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఇప్పటికే 'సాహో' ఫేమ్ సుజీత్‌కి దర్శకత్వ బాధ్యతలను సైతం అప్పజెప్పేశారు. ప్రస్తుతం ఆయన ఇక్కడి నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నారు.
దీంతో ఈ చిత్రంలో ఇతర నటీనటుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ పెట్టారట మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలోనే లూసిఫర్ ఒరిజినల్ వర్షన్‌లో మంజు వారియర్ చేసిన పవర్‌ఫుల్ రోల్ కోసం రోజాతో డీల్ సెట్ చేయించారట. మొదట ఈ రోల్ కోసం విజయశాంతి అనుకున్నారు, ఆ తర్వాత సుహాసిని, ఖుష్బూల పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్‌గా మెగాస్టార్ ఇంట్రెస్ట్‌తో రోజా వైపు మొగ్గారట దర్శకనిర్మాతలు.
ఇకపోతే సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడం వల్లే రోజా కూడా వెంటనే ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. గతంలో ''ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, బిగ్ బాస్'' లాంటి సినిమాల్లో మెగాస్టార్‌తో చిందేసిన రోజా.. ఈ సారి ఏ రేంజ్ పర్‌ఫార్‌మెన్స్ ఇస్తుందో చూడాలి మరి!.





Untitled Document
Advertisements