కీలక ప్రకటన: ఉద్యోగాల భర్తీకి బ్రేక్‌ వేసిన రైల్వే శాఖ!

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 01:13 PM

కీలక ప్రకటన: ఉద్యోగాల భర్తీకి బ్రేక్‌ వేసిన రైల్వే శాఖ!

కరోనా ప్రభావం రైల్వే శాఖపై కూడా భారీగానే పడింది. రైల్వే ఆదాయం మునుపటి కంటే 58 శాతం తగ్గింది. దీంతో ఉద్యోగాల భర్తీ విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రత (సేఫ్టీ) విభాగంలో పోస్టులు మినహా మిగతా విభాగాల్లో పోస్టుల మంజూరు, భర్తీ ప్రక్రియ నిలిపివేసింది.

తదుపరి ఆదేశాలు అందేవరకు కొత్త నోటిఫికేషన్లు విడుదల వద్దంటూ రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్ననియామక ప్రక్రియలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. అలాగే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిని తొలగించమని.. కానీ విభాగాలు మార్చే అవకాశం ఉందని పేర్కొంది.

కొత్త పోస్టుల నిలిపివేయడం, వర్క్‌షాపుల్లోని ఉద్యోగులను హేతుబద్ధీకరించడం, ఖర్చు తగ్గించడం, డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ను ఎక్కువగా వినియోగించుకోవడం ద్వారా నష్టాల నుండి గట్టెక్కాలని రైల్వే శాఖ భావిస్తోంది. కొత్త నోటిఫికేషన్లు నిలిపివేయడంతో దాదాపు 15 వేల ఉద్యోగాలకు రెడ్‌ సిగ్నల్‌ పడింది.





Untitled Document
Advertisements