రికార్డు : తెలంగాణలో ఒక్క రోజే 1892 కరోనా కేసులు నమోదు!

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 02:17 PM

రికార్డు : తెలంగాణలో ఒక్క రోజే 1892 కరోనా కేసులు నమోదు!

తెలంగాణలో శుక్రవారం (జులై 3) రికార్డు స్థాయిలో 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 20 వేల మార్క్ దాటింది. కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 8 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,462కు ఎగబాకగా.. కొవిడ్ మరణాల సంఖ్య 283కు చేరింది. శుక్రవారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1658 కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్ జిల్లాలో 44, వరంగల్ రూరల్ జిల్లాలో 41, సంగారెడ్డి జిల్లాలో 20, మహబూబ్‌నగర్ జిల్లాలో 12 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు చెందిన కరోనా పరీక్షల్లో అనుమానాలు ఉండటంతో లెక్కలోకి తీసుకోలేదని హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.
శుక్రవారం కొత్తగా నమోదై కేసుల్లో నల్గొండలో 13, మహబూబాబాద్ జిల్లాలో 7, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6, కామారెడ్డిలో 6, వనపర్తిలో 5, భద్రాద్రి కొత్తగూడెంలో 4, సిద్దిపేటలో 3, మెదక్‌లో 3, నిజామాబాద్‌లో 3, ఖమ్మంలో 2, నిర్మల్ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, ములుగు, జగిత్యాల, వరంగల్ అర్బన్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో కొత్తగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా నుంచి కోలుకొని శుక్రవారం పెద్ద సంఖ్యలో డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 1126 మంది డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 10,195కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,984 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగా 5,965 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,04,118 మందికి పరీక్షలు నిర్వహించారు.





Untitled Document
Advertisements