పోస్టాఫీస్ స్కీమ్‌తో అదిరేలాభం...రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు!

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 03:25 PM

పోస్టాఫీస్ స్కీమ్‌తో అదిరేలాభం...రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు!

చేతిలో ఉన్న డబ్బును ఎక్కడైనా డిపాజిట్ చేయాలని యోచిస్తున్నారా. అయిత మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు, ఈక్విటీ మార్కెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఎన్నో రకాల ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో డబ్బులు పెట్టొచ్చు. అయితే రిస్క్ లేకుండా మంచి రాబడి పొందాలంటే మాత్రం పోస్టాఫీస్‌ స్కీమ్‌లో డిపాజిట్ చేయాలి.

పోస్టాఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో కిసాన్ వికాస్ పత్ర కూడా ఒకటి. ఈ పథకంలో డబ్బులు పెడితే రెట్టింపు రాబడి పొందొచ్చు. అవును రూ.10 వేలు పెడితే రూ.20 వేలు వస్తుంది. అదే రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు పొందొచ్చు. అదే రూ.5 లక్షలు పెడితే.. రూ.10 లక్షలు కూడా వస్తాయి.

కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌తో ఎలాంటి భయం ఉండదు. రిస్క్ లేదు. కచ్చితమైన రాబడి వస్తుంది. పోస్టాఫీస్ స్కీమ్స్‌కు కేంద్ర ప్రభుత్వపు హామీ ఉంటుంది. అందువల్ల మీరు భయపడకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. కళ్లుచెదిరే లాభాన్ని సొంతం చేసుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై వడ్డీ రేటను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. వడ్డీ రేటు తగ్గొచ్చు. పెరగొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

ఈ స్కీమ్ మెచ్యూరిటీ గడువు 124 నెలలు. అంటే ఈ కాలంలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరేందుకు అర్హలు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 6.9 శాతం వడ్డీ లభిస్తోంది. నామినేషన్ ఫెసిలిటీ ఉంది. ఈ కిసాన్ వికాస్ పత్రాలను ఒక వ్యక్తి పేరు నుంచి మరొకరి పేరు పైకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements